వాణిజ్యరంగంలో మోదీ సర్కార్కు అతిపెద్ద విజయం దక్కింది. వారం రోజుల్లో రెండు చరిత్రాత్మక డీల్స్ కుదుర్చుకుంది భారత్.
గతవారం యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్పై భారత్ సంతకాలు చేసింది.
EU డీల్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగివచ్చారు భారత్తో వాణిజ్య ఒప్పందానికి ఆయనే ముందుకొచ్చారు.
భారత్పై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది అమెరికా 2 విడతలుగా విధించిన చెరో 25 శాతం ప్రతీకార సుంకాల్లో కీలకమార్పులు చేసింది.
రష్యా ఆయిల్ కొనుగోళ్లపై విధించిన 25 శాతం సుంకం ఎత్తేసింది అమెరికా. మరో విడతలో 25 శాతం సుంకాన్ని 18 శాతానికి పరిమితం చేసింది అమెరికా సుంకాలు భారీగా తగ్గడంతో భారత ఎగుమతులకు మళ్లీ గిరాకీ మొదలవుతుంది.
అయితే భారత్ కూడా తమ వస్తువులపై సుంకాలను తొలగిస్తుందని ట్రంప్ తన పోస్ట్లో చెప్పుకున్నారు.
ఇందులో భాగంగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గును భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ వివరించారు.
వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటనను స్వాగతించారు ప్రధాని మోదీ అమెరికా వస్తువులపై భారత్ సుంకాలను తొలగిస్తుందన్న ట్రంప్ ప్రకటనపై మోదీ స్పందించలేదు.
140 కోట్లమంది భారతీయుల తరపున ట్రంప్కి ధన్యవాదాలు తెలిపారు మోదీ రెండుపెద్ద ఆర్థికవ్యవస్థలు, రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి పనిచేస్తే అపారమైన అవకాశాలతో పరస్పర ప్రయోజనాలు కలుగుతాయన్నారు మోదీ.


క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి జగన్ గారు: నారా లోకేశ్ ట్వీట్