telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ జేఏసీ నేతల కీలక ప్రకటన!

ashwathama reddy

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, థామస్ రెడ్డి సహా 16 మంది జేఏసీ నేతలు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు, సమ్మె కొనసాగింపుపై కీలక చర్చలు జరిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాని అశ్వత్థామరెడ్డి కోరారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రకటించారు.

Related posts