telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీచేయడం పై స్పందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.

కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని  అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.

Related posts