telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన రోజా

Roja Mla

విజయవాడలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఎమ్మెల్యే ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మలు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రోజా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చేనేత వస్త్రాలు ధరించిన మోడల్స్ తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. జీతో మహిళా విభాగం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎగ్జిబిషన్‌లో ఉన్న మహిళలను చూస్తేనే మహిళా సాధికారత ఎంత వరకు అభివృద్ధి చెందిందో తెలుస్తోందని అన్నారు.

అన్ని స్టాల్స్‌లోనూ స్త్రీల నైపుణ్యంతో చేసినవే ప్రదర్శించడం చాలా నచ్చిందని అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న జీతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. చాలా యాక్టివ్‌గా ఎఫిషియంట్‌గా ఉన్న మహిళలను జీతోలో చూస్తున్నానని అన్నారు. ఇది మహిళలకు మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.

Related posts