telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

రాయలసీమ ప్రజల పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి.

కేతిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ఘాటుగా హెచ్చరించారు.

తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, తనకు పౌరుషం ఉందని చెప్పుకొచ్చిన జేసీ కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు.

ఐదేళ్లు అధికారంలో ఉండి, ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

గుడ్ మార్నింగ్ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి వద్ద ఉన్న కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.

నీటి ప్రాజెక్టులపై వైసీపీ రాజకీయాలు చేస్తే రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు ఏం చేశారు, జగన్ ఏం చేశారో ప్రజల ముందే తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ విసిరారు.

Related posts