హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది.
ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు.
గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.
నా భార్య నైతిక విలువలున్న మనిషి: సిద్ధూ