ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం.
అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్కు లేఖ రాసింది, ఆ లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు.
“ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా కల్పిస్తాం?” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ, అసెంబ్లీ నిబంధనలు ఇందుకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు.
స్పీకర్ ఇచ్చిన ఈ రూలింగ్ను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోరారు.
దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.