జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీ కే రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
జూన్ 02న రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈ పాటను ఆవిష్కరించనున్నారు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్ తో మీడియాతో మాట్లాడారు.
సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్ర లేదు అని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు కీరవాణి ఎంపిక ఫై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది.
సమ్మక్క, సారక్క నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నము అన్నారు.
పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందించినట్టు తెలిపారు.

