ఆంధ్రప్రదేశ్ ఏమైనా సీఎం జగన్ కు సొంతమా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తన నియోజవర్గానికి తాను వెళ్తానంటే జగన్కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం కావడం లేదని అన్నారు. బుధవారం రఘురామకృష్ణరాజు ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు. ఎంపీగా తన హక్కులను సీఎం హరిస్తున్నారని మండిపడ్డారు.
రామకృష్ణరాజు తన రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్లు సహచర ఎంపీలు తనకు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా జగన్ సొంతమా? అని ప్రశ్నించారు.
‘లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ’ విశాఖలో సమావేశం కావాల్సి ఉందని, ఈ విషయాన్ని కమిటీ సభ్యులు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా… కమిటీలో రఘురామరాజు ఉంటే ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తనకు తెలిసిందన్నారు. రఘురామ విశాఖ వస్తే అరెస్ట్ చేస్తామని.. ఆ తర్వాత కమిటీ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించినట్లు ఆరోపించారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు జగన్ దిగుతున్నారని మండిపడ్డారు
అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, తన గ్రామంలో, తన ఇంటి సమీపంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుంటే, స్థానిక లోక్సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్ అని, ముఖ్యమంత్రి హాజరైనా కాకపోయినా… తాను మాత్రం హాజరు కావాలన్నారు. 32 కేసుల్లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ విదేశాలకు వెళ్లొచ్చు కానీ.. తాను మాత్రం నియోజకవర్గానికి వెళ్లొద్దా? అని రఘురామ ప్రశ్నించారు.
బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్రెడ్డి