telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోవుల మృతి  పై ఏపీ సర్కారు విచారణ జరిపించాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

rajasing mla bjp

విజయవాడ శివారు ప్రాంతంలోని తాడేపల్లి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృత్యువాత పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందడం వెనుక కుట్ర ఉండొచ్చని అన్నారు.

ఏపీ సర్కారు ఈ ఘటనపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని అన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించడం తెలిసిందే. మరికొన్ని ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనను పలువురు ఖండించారు. విజయవాడ శివారు తాడేపల్లి గోశాలలో 1500 వరకు ఆవులు ఉన్నాయి. కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘంగా ఏర్పడి వాటి పోషణ బాధ్యతలు స్వీకరించారు.

Related posts