ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.
దీంతో తిరుపతిలో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో రష్మిక మాట్లాడుతూ బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వేదికపైకి వచ్చి రాగానే హాయ్ తిరుపతి అంటూ అల్లు అర్జున్ అభిమానులను ప్రేమగా పలకరించిన రష్మిక. సినిమా చూశారా అని ఫ్యాన్స్కి అడిగింది. ఈ సినిమాలో పుష్పగారు చించేశారుగా అంటూ రష్మిక మాటలకి బన్నీ అభిమానులను మరింత హుషారెత్తించియింది.
నేనైతే చెబుతున్నా పుష్పగారికి ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాను. అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారు. స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదు.
అంతేగాక పుష్పలో బన్నీ బాగున్నాడా? ఇప్పుడు ఇలా బాగున్నాడా? అని హోస్ట్ రష్మికను అడగ్గా.. నా పుష్పలాగానే బాగున్నాడంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. బన్నీ సార్ కాదా ఏం చేసినా బాగుంటాడులే అని రష్మిక చెప్పారు.
అలాగే ‘అల్లు అర్జున్ సార్ నేను మీకు ఫ్యాన్ని కాదు ఫ్యాన్ పైనా ఎదైనా ఉంటే అది నేనే అని రష్మిక మాట్లాడిన మాటలకు అందరిని ఆకట్టుకున్నారు
అలాగే ‘సుకుమార్ గారు డైరెక్షన్ చింపేశారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ఇంకా చాలా హిట్స్ రావాలని కోరుకుంటున్నానని, అలాగే పుష్ప పార్ట్- 2 పట్ల ఆతృతగా ఉందని చెప్పింది రష్మిక.
ఇక దేవిశ్రీ గారి పాటలు ఈ సినిమాకి హైలైట్. ప్రతి పాట అదిరిపోయింది. ఆయన పాటల వలన మాకు దిష్టి తగులుతుందేమోనని అనిపిస్తోంది. అందుకే నేను దిష్టి తీసుకుంటున్నాను. ఇక ఏ సినిమా ఇంత గొప్పగా రావడానికి మైత్రీ మూవీస్ వారు కారకులు. వాళ్లకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ రష్మిక మాట్లాడిన తీరు హైలైట్ గా నిలిచాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్గా, రష్మిక శ్రీవల్లిగా మాస్ గెటప్లుతో అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నారు.