‘అలా మొదలయ్యింది’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యామీనన్..ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింతే’, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’, ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్టు వంటి సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవలం హీరోయిన్గానే కాకుండా.. సింగర్గానూ తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకుంది నిత్యా మీనన్.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది నిత్యామీనన్. ఇటీవలే నిర్మాతగా మారి స్కైలాబ్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుంది. ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
అలా మొదలైంది సినిమా విడుదల తరువాత నేను ఓ ఇంటర్వ్యూకి వెళ్ళాను ..అప్పుడే నేను టాలీవుడ్కి కొత్తగా వచ్చాను. నాకు తెలుగు సరిగా రాదు.. తెలుగు సినిమాలు కూడా చూడలేదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను . ఆ విషయాన్ని పెద్దది చేసి.. నా అమాయకత్వంతో ఆడుకున్నారని వాపోయింది.. తనపై కొంతమంది జర్నలిస్టులు లేనిపోని వార్తలు రాశారని , వాటిని చూసి చాలా కృంగిపోయానని చెప్పుకొచ్చింది.
ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా.. న్యూస్ క్రియేట్ చేశారని.. ఆ ఇష్యూతోనే అన్ని చోట్ల హానెస్ట్ గా ఉండకూడదని , ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని.. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని అర్థమైందని..కానీ తను డిప్లమాటిక్ పెర్సన్ ని కాదని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.