ప్రముఖ సినీయర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన సృహలోకి వస్తున్నారని, రక్తపోటు స్థిరపడుతోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదలైంది.కైకాల కిడ్నీ పనితీరు మెరుగుపడుతోందని, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతోందని రిపోర్టులో ఉంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉన్నా.. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని సమాచారం.
కాగా..మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నామని, ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన అందరితో మాట్లాడుతున్నారని, ఎవరూ అందోళన చెందనవసరం లేదు అన్నారు. ఆయ ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.