కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్.. గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ఉంచారు. పునీత్చివరి చూపు కోసం సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తన నటన, వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందిన పునీత్.. ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే పునీత్ కేవలం కన్నడ చిత్రపరిశ్రమకే పరిమితం కాదు. తెలుగుతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన స్నేహితుడు పునీత్ రాజ్కుమార్ కు చివరిసారిగా చూసుకునేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న జూ.ఎన్టీఆర్ పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. స్నేహితుడిని అలా చూసి కన్నీరు కూడా పెట్టుకున్నారు ఎన్టీఆర్. పునీత్ సోదరుడు శివరాజ్ను, ఆయన కుటుంబసభ్యుల్ని ఓదార్చారు.
అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి పునీత్ రాజ్కుమార్కు అత్యంత సన్నిహితులలో నందమూరి కుటుంబసభ్యులు, అందులోనూ తారక్తో పునీత్కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. పునీత్-తారక్ ఎంతో కాలంగా మంచి స్నేహితులు. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే పాటను కూడా పాడారు.