తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 29న ప్యారిస్ లోని ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే “అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరమ్ లో మాట్లాడటానికి కె .టి .ఆర్ ను ఆహ్వానించారు.
ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి తనకు ఈరోజు ఆహ్వానం అందినట్టు . కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇంతటి
ప్రతిష్టాత్మకమైన సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం పట్ల కేటీఆర్ ను పలువురు అభినందిస్తున్నారు .