‘శాకుంతలం’ చిత్రంతో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ వెండి తెరకు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ తన కూతురు వద్దకి వచ్చి తన నటన చూసి మురిసిపోయాడు!. అలా సెట్లో అర్హని కలిసిన అర్జున్ తన మనసులో మాటని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
‘నటీనటులుగా మేం సెట్లో కలుసుకునేందుకు మరో 15-20 ఏళ్లు పడుతుందనుకున్నాను. కానీ ఈరోజే ఆ పరిస్థితి ఎదురైంది’ అని అర్హని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ తండ్రిగా ఉప్పొంగిపోయారు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోంది. అర్హ ఇందులో భరతుడిగా కనిపించనుంది. ప్రస్తుతం తను ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంది.
అదే లొకేషన్లో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ జరుగుతోంది. నా చిత్రం ‘పుష్ప’, అర్హ నటిస్తోన్న ‘శాకుంతలం’ ఒకే లొకేషన్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలా సెట్లో అర్హని కలిశాను. ఓ నటుడిగా (నేను) నటిని (అర్హ) సెట్లో కలిసే ఆనంద క్షణం 15-20 సంవత్సరాలకు వస్తుందనుకున్నా. కానీ అనుకోకుండా ఇంత త్వరగా వచ్చేసింది. పుష్ప మీట్స్ భరత ఇన్ శాకుంతలం. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది’’ అని పేర్కొన్నారు.
ప్రకాశ్రాజ్ ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడు: బండ్ల గణేశ్