telugu navyamedia
సినిమా వార్తలు

కృష్ణవంశీ కోసం చిరు వాయిస్ ఓవ‌ర్‌..

టాలీవుడ్ లో తనదైన సినిమాలతో ముద్ర వేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు ‘రంగ మార్తాండ’ పేక్ష‌కుల‌కు అరించ‌నున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

అయితే కృష్ణ వంశీ ఇప్పుడు ఆసక్తికర బిగ్ అప్డేట్ ని ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఈ చిత్రానికి గాను హీరో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ ని అందిస్తుండగా ఈ విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణ వంశీ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈవార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరియు నటి శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ లు కూడా కీ రోల్స్ చేస్తున్నారు.. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

Related posts