telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కెసిఆర్ కాలయముడు.. టిఆర్ఎస్ నేతలు బ్రోకర్లు : బండి సంజయ్

“తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” పేరుతో ఇవాళ తెలంగాణ బిజేపి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి పోయింది…రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు అని నిలదీశారు. నెల రోజుల నుండి ఐకేపీ సెంటర్లో ధాన్యం అలాగే ఉందని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేకపోతానే కేసీఆర్ సంతోషంగా ఉంటారని..రైతుల ఇబ్బందులపైన సీఎం కేసీఆర్ ఎక్కడికైనా పర్యటించారా ? అని నిలదీశారు. ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారని.. తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల దృష్టి మళ్లించడానికే సీఎం కేసీఆర్ హాస్పిటల్స్ పర్యటన చేశారని ఎద్దేవా చేశారు.

Related posts