మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను 30 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.60 కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 77. 73 కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 94.12, డీజిల్ రూ. 84. 63 కి చేరాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.09గా ఉండగా.. డీజిల్ ధర రూ. 84. 79కి చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ. 90. 53 కి చేరగా.. డీజిల్ రూ. 82. 40 కి చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ రూ. 89.96 పెరగగా.. డీజిల్ రూ. 82. 90 కు చేరుకుంది. కోల్కతా పెట్రోల్ రూ. 88.96 పెరగగా.. డీజిల్ రూ. 81.31కు చేరుకుంది. అటు జైపూర్లోనూ పెట్రోల్ రూ. 93.98 కి పెరరగా.. డీజిల్ రూ. 85. 95 కు చేరుకుంది. ఇక నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై రూ. 3,89 పెరగగా.. డీజిల్పై రూ. 3.91 పెరిగింది.
previous post