తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా తాప్సీ… భూమీ పడ్నేకర్తో కలిసి నటించిన “సాండ్ కీ ఆంఖ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా… విమర్శకులకు వ్యంగ్యంగా ఆమె ఇచ్చే సమాధానాలు అందర్నీ నవ్విస్తాయి. తాజాగా ట్విట్టర్లో “హిందీ చిత్రసీమ చరిత్రలో అత్యంత సమస్యాత్మక నటి తాప్సీ. ఆమెకు ఈ సంగతి తెలుసో? లేదో?’’ అని రాజీవ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. అందుకు బదులుగా తాప్సీ “నాకు తెలుసు. నా తల్లితండ్రులు కూడా నాతో సమస్యే అని నమ్ముతారు. మూసధోరణిలో జీవించే వ్యక్తులకు నాతో పెద్ద సమస్యే. నీకు ఇలా చెబుతున్నందుకు బాధగా ఉంది… నేనిలానే ఉంటాను. అందువల్ల, నీకు ఇంకొంచెం సహనం, శక్తి ఉండాలి” అని ట్వీట్ చేశారు. “తప్పడ్” సినిమా విడుదలైతే వాళ్లకు ఏమవుతుందో?” అని సోనీ పిక్చర్స్కు చెందిన లడ గురుదెన్ సింగ్ ట్వీట్ చేయగా… “ఉఫ్! ఆ తర్వాత నేను చాలామందికి సమస్యగా మారతాను. అప్పటి వరకూ వాళ్లను బతకనివ్వు” అని తాప్సీ బదులిచ్చారు.
previous post