పోలీయోను అరికట్టేందుకు ప్రతీ ఏడాది పల్స్ పోలియో నిర్వహిస్తోంది ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ జరగాల్సి ఉంది.. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని వాయిదా వేసింది. కార్యక్రమం మళ్లీ నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం.. . పల్స్ పోలియో వాయిదాపై జాతీయ ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం చేరవేశారు. ప్రస్తుతం ప్రజలను భయపెడుతోన్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. దీంతో.. పల్స్ పోలియా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనున్నారు. దీంతో వ్యాక్సినేషన్కు సిబ్బంది కొరత ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చింది కేంద్రం.
previous post
next post