దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క పక్క కరోనా ..మరో పక్క ఓమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి తో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజాగా 573 మంది కరోనాతో మృతి చెందగా.. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది.
మరోవైపు భారత్లో వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.