టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న వారిలో నాగార్జున కూడా ఒకడు. ఎప్పటికప్పుడు మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటాడు. తెలుగు చిత్రసీమలోని ఏకైక గ్రీకు వీరుడు. నాగ్ స్టైల్, డైలాగ్స్ అన్ని కొత్తగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా అన్ని సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. దాదాపు ఎనిమిది నెలల తరువాత తిరిగి ప్రారంభం అయ్యాక మంచి జోరు చూపించిన వారిలో నాగార్జున మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే న్యూ ఇయర్కు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే నాగ్ విదేశాల నుంచి ఈ వారం తిరిగి ఇండియాకు రాబోతున్నాడు. వచ్చీరాగానే మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై నారాయణ్ దాస్ నారంగ్, పీ రామ్మేహనరావు, శరత్ మరార్లు దీనిని సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీగా తెరకెక్కనుంది. కానీ దర్శకుడు ప్రవీణ్ ఇప్పటి వరకు ఫైనల్ డ్రాఫ్ట్ను పూర్తి చేయలేదు. దాంతో నాగ్ ఫైనల్ డ్రాఫ్ట్ను పూర్తి చేసుకొని తనను కలవమని ప్రవీణ్ సత్తారుకు డెడ్లైన్ పెట్టాడట. మరి ప్రవీణ్ డెడ్లైన్లోపు డ్రాఫ్ట్ పూర్తి చేస్తాడా చేయడా అనేది చూడాలి. ఒకవైపు బిగ్బాస్4 చేస్తూనే మరో వైపు వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేశాడు. నాగ్ స్పీడు చూసి యంగ్ హీరోలు కూడా ఔరా అన్నారు.