టాలీవుడ్లోని అగ్ర హీరోలతో సినిమాలు తీసే సంస్థల్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. ఎప్పుడూ బాడా హీరోలు, కొత్త హీరోలతో సినిమాలు తీస్తూ ఉండే ఈ సంస్త ఒక్కసారిగా గేర్ మార్చింది. అయితే నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఎప్పుడూ వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తూ అందరిని ఆకట్టుకుంటుంటారు. వీరికి వీరి పనీతీరు కారణంగా గొప్ప నిర్మాతలుగా పేరు వచ్చింది. వీరు ఇటీవల ఓ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు దర్శకుడిగి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేజ ఫేమ్ డైరెక్టర్ స్వరూప్ను ఎంపిక చేశారు. ఆ సినిమా ఈ రోజు పూజలతో షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాకి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ను ఖరారు చేవారు. ఇంగ్రీషులో ఉండే టైటిల్లో ఎస్ఐఓ అక్షరాల స్థానంలో హెచ్ఏ అక్షరాలు పెట్టారు. పేరు చూస్తేనే కాస్త ఇంటరెస్ట వస్తే ఇక పోస్టర్ కూడా అదే రేంజ్లో ఉంది. హనుమంతుడు, రాముడు, కృష్ణుడి వేషాలలో ఉన్న ముగ్గురు పిల్లలు వారి చేతిలో తుపాకీలతో ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమాలో ముగ్గురి పిల్లలతో పాటు మరో రెండు కీలక పాత్రలు కూడా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14నుంచి ప్రారంభం కానుంది.
previous post
next post