ఎంఎస్ ధోనీ గత ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా.. అతడి గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. నిత్యం అతడి పేరు వార్తల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం కంగారూల గడ్డపై జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి వైస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ సైతం మహీ మెరుపు వికెట్ కీపింగ్ నైపుణ్యాల గురించి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్తో మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేగాక టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు జట్టులో ధోనీ ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతడిని తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన టీ20లోనూ ఎంఎస్ ధోనీని ఎంతో మిస్ అవుతున్నామని భారత అభిమానులు ప్లకార్డులతో మైదానంలో ప్రదర్శించారు. Miss You Dhoni అంటూ ప్లకార్డులు పట్టుకుని సందడి చేశారు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్ అవుతున్నాని తెలియజేస్తూ సంజ్ఞ చేశాడు. ‘మీ టూ’ అంటూ చేతులతో సంజ్ఞ చేశాడు. ఇది చూసిన అభిమానులు కేరింతలతో కాసేపు స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
previous post