telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఆ రెస్టారెంట్ లో వ్యాక్సిన్ తీసుకున్నవారికి డిస్కౌంట్…

గత ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.  గల్ఫ్ దేశాల్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  యూఏఈ లో కూడా అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యులు వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు.  యూఏఈలో ఇప్పటి వరకు మొత్తం 27 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించారు.  నిరంతరంగా వ్యాక్సిన్ అందించేందుకు యూఏఈ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది.  వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటోంది.  ప్రభుత్వానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తమ సహాయం అందిస్తున్నాయి.  ఉడతాభక్తిగా సహాయం చేస్తున్నాయి.  ఇందులో భాగంగానే దుబాయ్ లోని బాబ్ ఆల్ షామ్స్ అనే రెస్టారెంట్ కొత్త ఆఫర్ ను ప్రకటించింది.  వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులకు తమ రెస్టారెంట్ లో అన్ని విభాగాల్లో 25శాతం ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది.  ఈ అఫర్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని రెస్టారెంట్ వారు తెలిపారు.

Related posts