ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజు సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఎలమంచిలి జనార్దన్ రావు ఈ తెల్లవారుజామున మరణించారని మీడియాకు సమాచారం అందింది. అయన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఇంజినీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక జనార్దన్ రావు వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. ఆయన అనారోగ్య కారణాలతో మరణించినట్లు చెబుతున్నారు. అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 11.45 నిముషాలకు జూబిలీహిల్స్ విస్పర్ వ్యాలీలోని మహాప్రస్థానంలో జరుగుతాయని మీడియాకు సమాచారం అందించారు. గతంలో తెలుగుదేశం తరఫున కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన సుజనాచౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బిజెపి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.. కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన సుజనా చౌదరి అనేక వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద స్థాయికి ఎదిగారు. అయితే సుజనా చౌదరి తండ్రి మరణం పై పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
previous post
next post
ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జయప్రద