telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యడ్యూరప్ప కోసం .. మహిళా ఎంపీ కష్టాలు… అభిమానమో/బంధమో..!

bjp mp pujas for yadurappa to become cm

బీజేపీ కర్ణాటకలో జండా పాతాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏదో విధంగా కూలగొట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో బలపరీక్షకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, ఎడ తెగని చర్చలు, సభ వాయిదాలు పడుతుంటంతో విశ్వాసపరీక్ష ఏరోజు-కారోజు వాయిదాపడుతూ వస్తోంది. బలపరీక్షలో నెగ్గుతామని కాంగ్రెస్-జేడీఎస్ ధీమా వ్యక్తం చేస్తుండటం, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం.

సభలో ఎన్ని జరుగుతున్నా .. బీజేపీ మాత్రం తన రాజకీయాలు మానట్లేదు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారే కాదు, మొక్కులు మొక్కు కుంటున్న వారూ లేక పోలేదు. బీజేపీ ఎంపీ శోభ కరండ్లజే అయితే మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ ఆలయానికి ఆమె వెళ్లేందుకు 1001 మెట్లను ఎక్కారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

Related posts