ముద్దుగుమ్మ ‘కాజల్’ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో అక్టోబర్ 30 ఆమె ఏడడుగులు వేశారు. లాక్డౌన్ కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. తన ప్రియసఖుడిని మనువాడే వేళ కాజల్ మోము పున్నమి ‘చందమామ’లా వెలిగిపోయింది. వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ జంటను చూసిన నెటిజన్లు ‘క్యూట్ పెయిర్, సూపర్ పెయిర్’ అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం కాజల్ హనీమున్ లో భాగంగా మాల్దీవుల్ కు వెళ్లింది. అక్కడ కాజల్ జంట చాలా ఎంజయ్ చేస్తోంది. అయితే..కాజల్ శోభనం కోసం భారీగా ఖర్చు చేస్తోందని సమాచారం. ఆ డబ్బులతో ఓ పేద కుటుంబం జీవిత కాలం బతికేయచ్చట. కాజల్ జంట మాలేలో ఉంటున్న అండర్ సీ విల్లా ఒక్క రోజు ఖర్చు అక్షరాలా 36 లక్షలట. అంత ఖర్చుతో కాజల్ హనీమున్ను ఎంజయ్ చేస్తోంది. ఇంత ఖర్చుతో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ హనీమూన్ కు ఇంత ఖర్చు చేయలేదని అందరూ వాపోతున్నారు. కాగా..ప్రస్తుతం ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, కమల్హాసన్తో ‘ఇండియన్-2’, మంచువిష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఆమె వెల్లడించిన విషయం విదితమే…
previous post
ఆ వార్తలు నిరాధారం : కరీనా కపూర్