కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్కు ఉన్న స్థిరాస్తుల్లో అత్యంత విలువైనది అతడి ఇల్లే. ‘మన్నత్’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. ముంబైలో, సముద్ర తీరాన ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉండే ఈ బంగ్లాలో షారుఖ్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే తాజాగా ‘ఆస్క్ ఎస్ఆర్కే’ పేరిట మంగళవారం సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ షారుఖ్ నివాసం ‘మన్నత్’గురించి ఓ ప్రశ్న అడిగాడు. ‘‘భాయ్ మన్నత్ను అమ్మేస్తున్నారా ఏంటి?’’ అని అడిగాడు. అతని ప్రశ్నకు స్పందించిన షారుఖ్ ‘‘మన్నత్ను ఎప్పుడూ ఎవరూ అమ్మలేరు.. ఇస్తారు.. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో అనుకున్నవని సాధిచంగలుగుతావు’’అని చమత్కరించాడు. కాగా మన్నత్ అంటే వాగ్దానం (మాట ఇవ్వడం). షారుఖ్ సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.
previous post
next post