బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హౌస్ కాల్పుల కేసులో అరెస్టయిన నిందితుడు అనుజ్ థాపన్ బుధవారం ముంబై పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో మరణించాడు.
మృతుడు అనుజ్ థాపన్ (23) లాకప్లోని టాయిలెట్లో బెడ్షీట్తో ఉరివేసుకున్నాడు. అతన్ని గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రకటించారు.
గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు.
మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీల ఆధారంగా గుజరాత్ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో విక్కీ గుప్తా, సాగర్ పాల్ లు కాల్పులు జరిపిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలతో అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.