telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అమ్మ పెరుగు తెమ్మన్నందుకు .. పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి..! ఎంత తెలివైన పిల్లాడో.. !!

Yash's fan tries to suicide

ఆలోచన చేయాల్సిన పనిలేని చదువులు.. విద్యార్థిని ఒత్తిడికి గురిచేసి, చివరికి డబ్బు సంపాదించే యంత్రం లా మాత్రమే తయారుచేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒత్తిళ్లతో పిల్లలు సున్నిత మనస్కులు అవుతున్నారు. చిన్న మాట పడలేకపోతున్నారు..ఆవేశంలో దిద్దుకోలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటువంటి చదువులంటేనే తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం విచిత్రం. ఈ సంఘటన మరీ విచిత్రం.. క్షణికావేశంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తల్లి తిట్టిందని మనస్థాపం చెందిన ఆ యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేసి, అలాగే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి జరిగింది. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి కుటుంబం కూడా కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చేసింది. దీంతో అందరూ కలిసి చింతల్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంటి దగ్గర ఉన్న వివేక్‌కు తల్లి పెరుగు తీసుకురమ్మని చెప్పింది. ఎంత సమయం అవుతున్నా.. అతడు వెళ్లకపోవడంతో తల్లి తిట్టింది.

దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్.. పెట్రోల్ తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. శివ అనే తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. అతడు చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనుకోని ఈ సంఘటనతో భయపడిపోయిన శివ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, వాళ్లు అక్కడకు చేరుకునే సరికే వివేశ్ ప్రాణాలు కోల్పోయాడు. శివ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Related posts