ఏపీలో అక్రమ కట్టడాలు కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత అనంతరం అక్రమకట్టడాలు, కూల్చివేతల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమ నిర్మాణాలని ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కానీ మీడియాలో ఓ వర్గం మళ్లీ చంద్రబాబు పల్లకీ సేవ మొదలుపెట్టిందంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అవన్నీ బాబు నిర్మించిన కట్టడాలు కావడంతో కుల మీడియాకు చారిత్రక నిర్మాణాల్లా కనిపిస్తున్నాయని వ్యంగస్త్రాలు సంధించారు. మీడియా కూడా చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని విజయసాయిట్విట్టర్ లో హితవు పలికారు.