telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

భార్య, కుమార్తెలను చంపి.. రైలుకింద పడి భర్త ఆత్మహత్య

New couples attack SR Nagar

మద్యానికి బానిసైన ఓ భర్త భార్యను కత్తితో పొడిచి చంపి, కుమార్తెను ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఆ కిరాతక భర్త కూడా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనం విశాఖపట్టణంలోని షిప్‌యార్డ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని షిప్‌యార్డ్ కాలనీ బింద్రానగర్ జాహ్నవి ఎన్‌క్లేవ్‌లో నివసించే శుక్రజిత్ భంజ్‌దేవ్-సుక్లతో సమాంత్‌లు భార్యాభర్తలు. 2017లో వీరికి వివాహమైంది. 2018లో కుమార్తె హర్షిత జన్మించింది.

ఎఫ్‌సీఐలో పనిచేసే శుక్రజిత్ మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేని సమాంత్ జూన్‌లో భువనేశ్వర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, కుమార్తెకు నచ్చజెప్పిన తల్లిదండ్రులు ఆమెను తిరిగి భర్త వద్దకు పంపించారు. ఈ నెల 19న కూడా భర్త ఆమెను హింసించాడు. తగిన మైకంలో భార్యను కత్తితో పొడిచి చంపిన శుక్రజిత్.. ఏడాది వయసున్న చిన్నారిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఒడిశాలోని రాజగాంపూర్ జీఆర్‌పీ అవుట్‌పోస్టు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాంత్ సోదరుడు పురుషోత్తందాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts