“అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోవడమే కాకుండా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదాను తెచ్చిపెట్టిన “అర్జున్ రెడ్డి” చిత్రం “కబీర్ సింగ్” పేరుతో ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మాతృకను రూపొందించిన సందీప్ వంగా ఈ రీమేక్కు కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. “డియర్ కామ్రేడ్” ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు కబీర్ సింగ్ చిత్రం గురించి అడిగారు. అయితే ఈ సినిమాను విజయ్ దేవరకొండ చూడలేదట. ఈ విషయాన్ని తాజాగా విజయ్ వెల్లడించాడు. “నేను `కబీర్సింగ్` చూడలేదు. ఇప్పటికే నేను చేసిన కథను మళ్లీ మరోసారి చూడాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. అతడి కోసం ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఏకంగా బ్లాక్బస్టర్ కావడం సంతోషంగా ఉంది” అని చెప్పాడు.
తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు : శర్వానంద్