టీవీ సీరియల్స్ షూటింగ్ నిలిపివేస్తున్నట్లు పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి తెలిపారు. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించనుండటంతో మళ్ళీ టీవీ సీరియల్స్ షూటింగ్ నిలిపివేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్లను రద్దు చేశారు. ఇటీవల పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లి తెర కళాకారుల సంఘం నిర్వాహకులు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభించేందుకు అనుమతి పొందారు. ఆ మేరకు వారం రోజులపాటు కరోనా నిబంధనల ప్రకారం టీవీ సీరియల్స్ షూటింగ్ చురుకుగా సాగింది. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకూ సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో టీవీ సీరియల్స్ షూటింగ్ కూడా నిలిపివేస్తున్నట్టు ఆర్కే సెల్వమణి తెలిపారు.
next post