లెబనాన్ రాజధాని బీరుట్లోని సంభవించిన పేలుళ్ళు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. బీరుట్ ఓడరేవు పరిసరాల్లో 15 నిమిషాల వ్యవధిలోనే జరిగిన రెండు భారీ పేలుళ్లలో 78 మంది మృతి చెందగా, దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. పేలుళ్లలో చనిపోయిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపాలను వ్యక్తం చేస్తున్నారు చాలామంది. పలువురు సెలబ్రిటీలు బీరుట్ ఘటనపై ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రకుల్ ప్రీత్ “గుండె పగిలిపోయింది. 2020లో ఇప్పటికే చాలా జరిగాయి. ఎందుకిలా? ఇక చాలు. బీరుట్లోని ప్రజలకు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఇక తమన్నా “గుండె ముక్కలయ్యే విషయమిది. ఈ దుర్ఘటనతో కలత చెందాను. బీరుట్ ప్రజలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
next post