telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీరుట్‌ పేలుళ్లపై తమన్నా, రకుల్ సంతాపం

Rakul

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని సంభవించిన పేలుళ్ళు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. బీరుట్‌ ఓడరేవు పరిసరాల్లో 15 నిమిషాల వ్యవధిలోనే జరిగిన రెండు భారీ పేలుళ్లలో 78 మంది మృతి చెందగా, దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. పేలుళ్లలో చనిపోయిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు చాలామంది. ప‌లువురు సెల‌బ్రిటీలు బీరుట్ ఘటనపై ట్విట్ట‌ర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రకుల్ ప్రీత్ “గుండె పగిలిపోయింది. 2020లో ఇప్పటికే చాలా జరిగాయి. ఎందుకిలా? ఇక చాలు. బీరుట్‌లోని ప్ర‌జ‌ల‌కు మ‌నోధైర్యాన్నివ్వాల‌ని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఇక తమన్నా “గుండె ముక్క‌ల‌య్యే విష‌య‌మిది. ఈ దుర్ఘ‌ట‌న‌తో క‌ల‌త చెందాను. బీరుట్ ప్ర‌జ‌ల‌కు సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

Related posts