చైనా తలెత్తిన గొడవల కారణంగా కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత చర్యతో బాగా నష్టపోయింది టిక్ టాకే. అతి పెద్ద దేశమైన ఇండియా నుంచి టిక్ టాక్ పెద్ద మొత్తంలోనే ఆర్జించేది. నిషేధంతో నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టిక్టాక్ తన యాజమాన్యాన్ని మార్చుకొని మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది. టిక్టాక్ చైనా కంపెనీ కాబట్టి భారత్ నిషేధించింది. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్.. టిక్టాక్ను కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ అయితే మన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ద్వారా టిక్టాక్ త్వరలోనే ఇండియాకు వచ్చేయ డానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా ప్రభుత్వం కూడా టిక్టాక్ను నిషేధిస్తుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా టిక్టాక్ యాజమాన్యానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లైన్ విధించాడు. ‘45 రోజుల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి టిక్టాక్ అమ్మితే సరి. లేదంటే మా దేశంలోనూ టిక్టాక్ నిషేధిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. దీంతో విధిలేని పరిస్థితిల్లో మైక్రోసాఫ్ట్కు టిక్టాక్ను విక్రయించనున్నారు. ప్రస్తుతం భారత్, అమెరికా సంబంధాలు బాగున్నాయి కాబట్టి.. టిక్టాక్ మనదేశంలో మళ్లీ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. నిజంగా ఇది టిక్టాక్ లో వీడియోలు తీసేవారికి, టిక్టాక్ ఫాలోవర్స్ కి పండుగ లాంటి వార్తే.
previous post