telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

ఇండియాకు మళ్ళీ టిక్ టాక్

Tik-Tok

చైనా తలెత్తిన గొడవల కారణంగా కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత చర్యతో బాగా నష్టపోయింది టిక్ టాకే. అతి పెద్ద దేశమైన ఇండియా నుంచి టిక్ టాక్ పెద్ద మొత్తంలోనే ఆర్జించేది. నిషేధంతో నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ తన యాజమాన్యాన్ని మార్చుకొని మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది. టిక్​టాక్​ చైనా కంపెనీ కాబట్టి భారత్​ నిషేధించింది. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్​.. టిక్​టాక్​ను కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ అయితే మన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ద్వారా టిక్​టాక్​ త్వరలోనే ఇండియాకు వచ్చేయ డానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా ప్రభుత్వం కూడా టిక్​టాక్​ను నిషేధిస్తుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా టిక్​టాక్ యాజమాన్యానికి ​అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ డెడ్​లైన్​ విధించాడు. ‘45 రోజుల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్​ కంపెనీకి టిక్​టాక్​ అమ్మితే సరి. లేదంటే మా దేశంలోనూ టిక్​టాక్​ నిషేధిస్తాం’ అంటూ వార్నింగ్​ ఇచ్చాడు ట్రంప్​. దీంతో విధిలేని పరిస్థితిల్లో మైక్రోసాఫ్ట్​కు టిక్​టాక్​ను విక్రయించనున్నారు. ప్రస్తుతం భారత్​, అమెరికా సంబంధాలు బాగున్నాయి కాబట్టి.. టిక్​టాక్​ మనదేశంలో మళ్లీ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. నిజంగా ఇది టిక్​టాక్ లో వీడియోలు తీసేవారికి, టిక్​టాక్ ఫాలోవర్స్ కి పండుగ లాంటి వార్తే.

Related posts