ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం నల్గొండలో ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి చంద్రబాబు కుంటిసాకుగా ఢిల్లీకి పారిపోయారన్నారు. ఎన్నికల సంఘం పై ఫిర్యాదు చేస్తూ, ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు