ఏపీలో అలజడులు సృష్టంచడానికి జగన్, పికే (ప్రశాంతకిషోర్) కట్రలు పన్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. ఏపీలో పీకే కుట్రలకు వైసీపీ రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్పై దాడిని సమర్ధించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడులకు పాల్పడుతోందని అన్నారు.
స్పీకర్పై దాడి చేసి, ప్రతిరోజు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. 11వ తేదీన కోడెలపై దాడి చేయడమే కాకుండా గత నాలుగు రోజులుగా ఎదురుదాడితో సమర్థించుకునే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తోందని దుయ్యబట్టారు. ఇంతకంటే దుర్మార్గం లేదని ఆయన అన్నారు. వైసీపీకి ఓటు వేయలేదని అమాయకులైన ఓటర్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని దేవినేని ప్రశ్నించారు.