telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

kumara swamy

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 సాంకేతిక లోపంతో వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైసూరులో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం చోటుచేసుకుందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

బెంగళూరు ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టిన వేళా విశేషం కారణంగా సైంటిస్టులను శని పట్టుకుందని అన్నారు. చంద్రయాన్-2 ఘనత తనదేనని చెప్పుకోవడానికే మోదీ బెంగళూరు వచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు 12 ఏళ్లు ఎంతో కృషి చేశారని అన్నారు. మోదీ కారణంగా అంతా నాశనం అయిందని దుయ్యబట్టారు.

Related posts