బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి నెపోటిజమే కారణమని దుమారం రేగింది. బాలీవుడ్లో కొందరు సుశాంత్ కావాలనే దూరం పెట్టారని, అతన్ని పార్టీలకు పిలవక పోవడం, తమ సినీ కుటుంబంలో వ్యక్తిలా భావించకపోవడంతో అతను డిప్రెషన్కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులపై కోర్టులో కేసు కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ స్నేహితురాలు రోహిణి అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించారు. “నేను సోషల్ మీడియాను గమనించిన ప్రతిసారి సుశాంత్ గురించి రాసిన వార్తల్లో ఎక్కువ శాతం ఊహాజనితమైనవే. అతనెప్పుడూ పేరు గురించి ఆలోచించలేదు. అతను కపట స్నేహితులను ద్వేషించేవాడు. అతన్ని బాలీవుడ్ దూరం పెట్టలేదు. అతనికే చుట్టూ జరిగే పార్టీలంటే ఇష్టముండేది కాదు. అతను వెళ్లేవాడు కాదు. అతను సినీ పరిశ్రమకు ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చాడు. దాని గురించి ఎప్పుడూ తను బాధపడలేదు. అందుకు కారణం సినిమాలకు మించిన జీవితం ఉందని తను భావించాడు. అతని జీవితంలో సినీ పరిశ్రమ ఓ భాగం మాత్రమే. దాన్ని మించిన ప్రపంచం తనకుండేది. అతను సక్సెస్ను పెద్దగా పట్టించుకోలేదు. అలాగని తనెప్పుడూ ఓడిపోలేదు. అతనితో పాటు సినీ రంగంలోకి అడుగు పెట్టిన హీరోల కంటే ఎక్కువ విజయాలను అందుకున్నాడు. అతను వంద కోట్ల క్లబ్లో ఉండాలనుకోలేదు. అలాంటి క్లబ్స్ గురించి తనెప్పుడూ ఆలోచించలేదు. ఓ సందర్భంలో అవార్డ్ ఫంక్షన్కు వచ్చాడు. అక్కడ బోర్ కొడుతుందని మధ్యలోనే వెళ్లిపోయాడు. ఆ అవార్డ్ ఫంక్షన్లో అతను బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు. అది అందుకోకుండానే బోర్ కొడుతుందనిపించి వెళ్లిపోయాడు” అని తెలిపారు
previous post