telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : భీమ‌వ‌రంలో 50 అడుగుల మహేష్ భారీ క‌టౌట్‌

SN

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత “స‌రిలేరు” నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అభిమానులు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర థియేట‌ర్స్‌ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భీమ‌వ‌రంలో 50 అడుగుల భారీ క‌టౌట్‌ని ఏర్పాటు చేయ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌తంలోను మ‌హేష్ కోసం భారీ కటౌట్స్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

Related posts