అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. 200 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలందరికీ మేమంతా మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామని అన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదని, ప్రభుత్వం నిరంతరంగా ఉంటుందని చెప్పారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డిగారు సీఎం అయ్యాక మడమ తిప్పడం విచారకరమని విమర్శించారు.
రెడ్డి, వెలమలకు మూడు బలుపులుంటాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే