ఏపీకి కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం నేడు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు ఎల్వీ సుబ్రహ్మణ్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది ఎన్నికల సంఘం.