బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తాజాగా నటించిన చిత్రం “సత్యమేవ జయతే-2”. 2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రానికి మిలాప్ జావేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహం తరనపున దివ్య ఖోస్లా కుమార్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అవినీతికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చుట్టూ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ విడుదుల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. 2020 అక్టోబర్ 2న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా మే 12న విడుదల కానుంది. జాన్ అబ్రహం తాజాగా ఈ చిత్రం పోస్టర్ను తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అబ్రహం చేతిలో నాగలి, శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం త్రివర్ణ పతాకంలో ని మూడు రంగుల్లో కారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ అతడి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి ‘గంగా మాత ప్రవహించే భూమిలో.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది’ అనే క్యాప్షన్తో షేర్ చేశాడు.
previous post