బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన పుట్టిన రోజును ఆదివారం రాత్రి ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్, సోదరి కరిష్మా కపూర్, తల్లిదండ్రులు బబిత రణధీర్తో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ పుట్టినరోజుతో ఆమె 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కరీనా స్వయంగా ఓ లేఖ రాసుకున్నారు. “శక్తివంతమైన స్త్రీగా మలచుకోవడానికి తీసుకున్న నా నిర్ణయాల్లో, అనుభవాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి. తప్పులు కూడా ఉన్నాయి. అలాగే మార్చిపోలేనివి కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ పుట్టిన రోజు నాకు గొప్ప అనుభూతిగా ఉంది” అంటూ కరీనా తన లేఖలో రాసుకొచ్చారు. ఇన్నేళ్ల తన జీవితంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో శక్తివంతురాలిగా ఉన్నందుకు తనకు తాను ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇక కరీనా సందర్భంగా ఆమెకు సోషల్ మీడయాలో బాలీవుడ్ ప్రముఖులు, సహనటులు, అభిమానుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కరీనా సినీ కెరీర్ విషయానికొస్తే… స్టార్ వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన కరీనా కపూర్.. ఆ తర్వాత సొంత గుర్తింపు సంపాదించుకుని స్టార్గా ఎదిగింది. పదేళ్ల పాటు బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 2012లో హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు కరీనా.
previous post