27 ఏళ్ళ క్రితం తెరకెక్కిన “సడక్” చిత్రానికి సీక్వెల్గా ఇప్పుడు “సడక్ 2” అనే చిత్రాన్ని మహేష్ భట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్య రాయ్ కపూర్తో పాటు అలియాభట్ కూడా నటిస్తుంది. తొలిసారి తన తండ్రి దర్శకత్వంలో అలియా నటిస్తుంది. ‘సడక్ 2’ చిత్రాన్ని వికేష్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సైతే తాజాగా డైరెక్టర్ మహేశ్ భట్, నిర్మాత ముఖేష్ భట్, హీరోయిన్ ఆలియా భట్లపై ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ కోర్టులో కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ పోస్టర్ హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ… 120బీ, 295ఏ సెక్షన్ల క్రింద మహేశ్ భట్, ముఖేష్ భట్, ఆలియా భట్లపై సోను కుమార్ అనే న్యాయవాది కేసు నమోదు చేశారు.
previous post