రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తయింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు అయితే ఈ సినిమాకు మొదటినుండి ఉన్న సమస్య మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఎట్టకేలకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దొరికేసాడు. ఈ విషయాన్ని తాజగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తుండగా… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చనున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ అప్డేట్ను భారత్ దేశపు మ్యాప్పై చూపించారు. అంతేకాకుండా ఇందులో మధ్యలో ట్రైన్ వెళుతున్నట్లు కూడా చూపిచంారు.
previous post
next post
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు