ఫ్రెంచ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీ లో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి పివి సింధు, సైనా నెహ్వాల్ దూసుకెళ్లారు. ప్రి-క్వార్టర్ఫైనల్ పోటీలో సైనా 21-10, 21-11 పాయింట్ల తేడాతో కాస్ఫడెల్ట్(ఇంగ్లండ్)పై… పివి సింధు 21-10, 21-13తో యియో-జి-మింగ్(సింగపూర్)ను చిత్తుచేసింది. భారత షట్లర్లు ఇద్దరూ ప్రి క్వార్టర్స్లో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందారు. సైనాతో తలపడిన ఇంగ్లండ్ షట్లర్ కనీస ప్రతిఘటన చూపలేకపోయింది.
క్వార్టర్స్లో 8వ సీడ్ సైనా కొరియాకు చెందిన అన్-సే-యంగ్తో తలపడనుంది. డెన్మార్క్ ఓపెన్లో అన్-సే రెండోరౌండ్ వరుస సెట్లలో 5వ సీడ్ సింధును ఓడించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల డబుల్స్లో రంకిరెడ్డి-చిరాగ్శెట్టి జోడీ 21-18, 18-21, 21-13 పాయింట్ల తేడాతో ఇండోనేషియా జోడీని చిత్తుచేసి క్వార్టర్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్లో భారతజోడీ ఇంగ్లండ్కు చెందిన అష్ట్రఫ్-రాస్ముసేన్తో తలపడనున్నారు.