telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీ .. క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు, సైనా..

sindhu and saina in quarters in french open super 750

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీ లో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు, సైనా నెహ్వాల్‌ దూసుకెళ్లారు. ప్రి-క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో సైనా 21-10, 21-11 పాయింట్ల తేడాతో కాస్ఫడెల్ట్‌(ఇంగ్లండ్‌)పై… పివి సింధు 21-10, 21-13తో యియో-జి-మింగ్‌(సింగపూర్‌)ను చిత్తుచేసింది. భారత షట్లర్లు ఇద్దరూ ప్రి క్వార్టర్స్‌లో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందారు. సైనాతో తలపడిన ఇంగ్లండ్‌ షట్లర్‌ కనీస ప్రతిఘటన చూపలేకపోయింది.

క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ సైనా కొరియాకు చెందిన అన్‌-సే-యంగ్‌తో తలపడనుంది. డెన్మార్క్‌ ఓపెన్‌లో అన్‌-సే రెండోరౌండ్‌ వరుస సెట్లలో 5వ సీడ్‌ సింధును ఓడించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల డబుల్స్‌లో రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడీ 21-18, 18-21, 21-13 పాయింట్ల తేడాతో ఇండోనేషియా జోడీని చిత్తుచేసి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో భారతజోడీ ఇంగ్లండ్‌కు చెందిన అష్ట్రఫ్‌-రాస్ముసేన్‌తో తలపడనున్నారు.

Related posts